Wednesday, March 13, 2019

అగ్రిగోల్డ్‌ దరఖాస్తుల స్వీకరణ…..

శ్రీకాకుళం:న్యూస్‌టుడే:
*రాజం రూరల్ పరిధిలోని ఖాతాదారుల దరఖాస్తుల స్వీకరణ  
*అగ్రిగోల్డ్ ఖాతాదారులకు  చెలింపుల ప్రక్రియ… 
* జిల్లా న్యాయ సేవాధికార  సంస్ధ కార్యదర్శి  పరిశీలించారు.   
శ్రీకాకుళం నగరంలోని కోడి రావ్మర్తి మైదానంలో జిల్లా కోర్టు, జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అగ్రిగోల్డ్‌ ఖాతాదారులు డిపాజిట్‌ చేసిన రూ. 10 వేలు, అంతకంటే తక్కువ మొత్తాల చెల్లింపుల ప్రక్రియలో భాగంగా దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. రాజాం రూరల్‌ మండలం పరిధిలోని ఖాతాదారుల దరఖాస్తులను బుధవారం స్వీకరించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.శ్యామలాదేవి పరిశీలించారు. సంతకవిటి మండలం పరిధిలోని ఖాతాదారుల దరఖాస్తులను నేడు (గురువారం) స్వీకరించనున్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ అధికారులు, జిల్లా న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది, అగ్రిగోల్డ్‌ ఖాతాదారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment