Thursday, March 14, 2019

నిప్పంటుకుని గుడిసెలు దగ్ధం…..


కడప న్యూస్‌టుడే:
  • సిగరెట్లు తాగి ఆర్పనందుకే ఈ ప్రమాదం.
పట్టణంలోని న్యూ కృష్ణా నగర్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలభై వేల ఆస్తి నష్టం జరిగిందని అగ్నిమాపక అధికారి సుబ్బరాజు తెలిపారు.కృష్ణా నగర్‌లో ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు సిగరెట్లు తాగి నిర్లక్ష్యంగా పడవేయడంతో భిమానాయకులకు చెందిన గుడిసెలు నిప్పంటుకుని మంటలు చెలరేగాయి.అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి వచ్చి మంటలు ఆర్పేశారు.అయినప్పటికి దాదాపు నలభై వేల ఆస్తి నష్టం జరిగిందని పేర్కొన్నారు.

No comments:

Post a Comment