మ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మరోమారు తెగబడ్డారు. ఆ ఆర్మీ జవాను ఇంటికెళ్లి మరీ ఆయనను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. కాజీపొరా చడూరలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. జమ్ముకశ్మీర్లోని లైట్ ఇన్ఫాంట్రీకి చెందిన మహమ్మద్ యాసిన్ భట్ ఈ నెలాఖరు వరకు సెలవులో ఉన్నాడు. ఈ క్రమంలో ఆయన ఇంటికి చేరుకున్న కొందరు వ్యక్తులు యాసిన్ను బలవంతంగా ఇంటి నుంచి తీసుకెళ్లినట్టు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యాసిన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
No comments:
Post a Comment