గుంటూరు జిల్లా, సత్తెనపల్లి:
* ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయడంపై కృషి చూపించాలి…
పోలియో రహిత సమాజ సహకారానికి సమిష్టి కృషి చేయాలనే గుంటూరుజిల్లా సత్తేనపల్లి పురపాలక సంఘం చైర్మన్ రామస్వామి పేర్కొన్నారు. పురపాలక సంఘం కార్యాలయం వద్ద ఆదివారం చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ఆయన మాట్లాడాదు. ఐదేళ్ళలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయడంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యావంతులు కృషి చూపించాలన్నారు. ప్రభుత్వాలకు ప్రజలు చైతన్యంతో చాలాకాలంగా దేశంలో రాష్టంలో పోలియో కేసులు నమోదవ్వడం లేదన్నారు. మూడు రోజుల పాటు నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కమిషనర్ ఏ వెంకటేశ్వర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
No comments:
Post a Comment