గుంటూరుజిల్లా: న్యూస్టుడే:
*డేటా ఆంధ్రప్రదేశ్కు చెందినది…
*23న ఐటీ గ్రిడ్స్ సంస్థపై దాడులు…
డేటా చౌర్యం అభియోగాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి అధికార పరిధి తెలంగాణ పోలీసులకు లేదని ఐటె గ్రిడ్స్ (ఇండియ) డైరెక్టర్ డి. అశోక్ వాదించారు. చోరీకి గురైందని చెబుతున్న డేటా ఆంధ్రప్రదేశ్కు చెందినదని ఆయన తరపు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ లూథ్రా పేర్కొన్నారు. ఆ రాష్ట్రానికి సంబంధిచిన డేటా చోరీ అయితే తెలంగాణ పోలీసులు కేసు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. సెక్షన్ 97 కింద సెర్చ్ వారెంటు లేకుండా ఫిబ్రవరి 23న ఐటీ గ్రిడ్స్ సంస్థపై దాడులు చేసి హార్డ్ డిస్క్లను తీసుకెళ్లారని బుధవారం హైకోర్టు ధర్మాసనానికి తెలియజేశారు. సంస్థ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులపైనా పోలీసులు ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు.

No comments:
Post a Comment