చిత్తూరు న్యూస్టుడే:
* తెదేపా జాతీయ ఉపాధ్యక్షురాలుకు తీవ్ర అస్వస్థత
*ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది.
రక్తపోటు అధికం కావడంతో తీవ్ర అస్వస్థతకు గురైన తెదేపా జాతీయ ఉపాధ్యక్షురాలు,ఎమ్మెల్యే డీఏ సత్య ప్రభ ఆరోగ్యం నిలకడగా ఉంది.మంగళవారం విజయవాడలోని ఆంధ్రా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందిన ఆమెను బుధవారం మధ్యహ్నం విమానంలో బెంగుళూరుకు తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి మాల్యా ఆసుపత్రిలో చేర్పించారు.రక్తపోటు నియంత్రణలోకి వచ్చి ఆమె ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది.ఒకట్రెండు రోజుల్లో పూర్తిగా కోలుకుని చిత్తూరుకు రానున్నారని కుటుంబ సబ్యులు తెలిపారు

No comments:
Post a Comment