గుంటూరుజిల్లా:మంగళగిరి: న్యూస్టుడే: ముఖ్యాంశాలు….
*వైఎస్ జగన్ తనకు మంగళగిరి టిక్కెట్ ఇస్తే మంత్రి నారా లోకేశ్పై తప్పకుండా గెలుస్తానని అంటున్నారు ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు…
* ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తారా? లేదా? అన్నది సస్పెన్స్గా మారింది…
*తన నిర్ణయంతో ఎన్టీఆర్కు ఎలాంటి సంబంధం లేదు…
వైఎస్ జగన్ తనకు ఛాన్సిస్తే మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేశ్పై పోటీచేసి గెలుస్తానని అన్నారు హీరో ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు. ఇటీవలే వైసీపీలో చేరిన ఆయన్ని పార్టీ కేంద్ర పాలకమండలి(సీజీసీ) సభ్యుడిగా నియమించారు అధినేత వైఎస్ జగన్. అయితే ఆయనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తారా? లేదా? అన్నది సస్పెన్స్గా మారింది. ఈ నేపథ్యంలోనే నార్నె చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ మంగళగిరి నుంచి పోటీ చేస్తారని టీడీపీ అధిష్ఠానం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా.. మంగళగిరి టిక్కెట్ తనకు కేటాయిస్తే లోకేశ్పై తప్పకుండా గెలుస్తానని అన్నారు నార్నె శ్రీనివాసరావు. చంద్రబాబుకు, జగన్కు చాలా తేడా ఉందని, ప్రజల కోసం వైఎస్ ఎంతో చేశారు కాబట్టే తాను జగన్కు మద్దతిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ను చంద్రబాబు డెవలప్ చేయలేదని అన్నారు. తన నిర్ణయంతో ఎన్టీఆర్కు ఎలాంటి సంబంధం లేదని.. ఈ అంశాన్ని ఆయనతో ముడిపెట్టొద్దని కోరారు.

No comments:
Post a Comment