హిమాచల్ ప్రదేశ్ న్యూస్టుడే :
- భారీ స్థాయిలో హిమపాతం కురిసింది.
- గ్రామంపై మంచు చరియలు విరుచుకుపడ్డాయి.
హిల్ స్టేషన్ హిమాచల్ ప్రదేశ్ లో భారీ స్థాయిలో హిమపాతం కురిసింది. లాహౌల్, స్పిటీ జిల్లాలోని టాండీ గ్రామంపై మంచు చరియలు విరుచుకుపడ్డాయి. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా యంత్రాంగం సరిహద్దు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసి.సురక్షిత ప్రాంతాలకు తరలించింది. పొడిమంచు సునామిని తలపించేలా గ్రామంవైపు దూసుకొస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
No comments:
Post a Comment