గుంటూరు న్యూస్టుడే:
*ఈ నెల 18 నుంచి విధుల ప్రారంభం.
*కేసులు ఫైలింగ్, విచారణ కొత్త భవనం నుంచే.
ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ విధులు ఈ నెల 18 నుంచి రాజధాని పరిధి గ్రామం నేలపాడులో నిర్మితమైన నూతన భవనం నుంచి జరగనున్నాయి. వచ్చే సోమవారం నుంచి కేసుల ఫైలింగ్, విచారణ తదితరాలన్నీ కొత్త కొత్త భవనం నుంచే జరుగుతాయని పేర్కొంటూ హైకోర్ట్ రిజిస్ట్రార్ జనరల్ సీహెచ్ మానవేంద్రనాథ్ రామ్ బుధవారం ప్రకటన విడుదల చేశారు. మంగళవారం ఈ భవానాన్ని పరిశీలించిన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్.సి ప్రవీణ్ కుమార్ ఇక్కడి నుంచి విధులు నిర్వహించేందుకు ఆమోదం తెలిపారు.

No comments:
Post a Comment