Friday, March 8, 2019

కుప్పకూలిన మిగ్ 21 యుద్ధ విమానం.. ?

రాజస్థాన్ న్యూస్‌టుడే: 
  • ప్రమాదం నుంచి బయట పడ్డ అధికారులు
ఐఏఎఫ్‌కు చెందిన మిగ్ 21 యుద్ధ విమానం కుప్పకూలిపోయింది. రాజస్థాన్‌లోని బికనీర్‌ ఎయిర్ బేస్‌లో ఈ ప్రమాదం జరిగింది. పక్షి ఢీకొనడంతోనే ఈ ప్రమాదం జరిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన మిగ్‌-21 యుద్ధ విమానం కుప్పకూలింది. రాజస్థాన్‌లోని బికనేర్‌ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరగడానికి ముందే పైలట్‌ విమానం నుంచి ఎజెక్ట్‌ అయినట్లు తెలుస్తోంది. ప్రమాదం నుంచి పైలట్‌ సురక్షితంగా బయటపడ్డారని అధికారులు తెలిపారు. రాజస్థాన్‌లోని బికనీర్‌కు సమీపంలో ఉన్న శోభా సర్‌కీ ధానీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాజస్థాన్‌లోని నాల్‌ ఎయిర్‌బేస్‌కు మిగ్‌-21ను తరలిస్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.డెస్క్:దుర్గ

No comments:

Post a Comment