విశాఖ న్యూస్టుడే:
- డిగ్రీ కళాశాల వద్ద ఏర్పాటైన పోలీస్ చెక్పోస్ట్ వద్ద శుక్రవారం సాయంత్రం తనిఖీలు.
- ఎక్కువ మొత్తం నగదు కావడంతో సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందజేశారు.
నర్సీపట్నం డిగ్రీ కళాశాల వద్ద ఏర్పాటైన పోలీస్ చెక్పోస్ట్ వద్ద శుక్రవారం సాయంత్రం తనిఖీలు నిర్వహిస్తున్నప్పుడు ఓకకారులో రూ.18 లక్షలు నగదు పోలీసులు గుర్తించారు. ఎక్కువ మొత్తం నగదు కావడంతో సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందజేశారు. ఏఎస్పీ అరిఫ్ ,సీఐ లక్షణరావు హూటావుటిన వచ్చి పరిశీలన చేశారు. తునిలోని బ్యాంకులో నగదు తీసుకున్నట్లు కారులో ప్రయాణిస్తున్న వారు రశీదులు చూపారు. ఈ నగదు జీకేవిధి తీసుకువెళుతున్నామన్నారు. ఏ అవనరం కోసం వినియోగిస్తామో వివరించారు. దీంతో వాహనంలో వారందరి చిరునామాలు తీసుకుని వాహనాన్ని విడిచిపెట్టారు. సీఐలక్ష్మణరావు జీకేవీధి ఎస్సైతో మాట్లాడి వివరాలు అందజేశారు. క్షేత్రస్తాయిలో పరిశీలన చేయాలని సూచించారు.
No comments:
Post a Comment