శ్రీకాకుళం న్యూస్టుడే:
1)ఉద్యోగాల సాధనలో వ్యక్తిగత నైపుణ్యాలు అత్యంత కీలకమని ఏజీఎం కాంచన్ కేధకర్.
2) ఈఈఈ విభాగం ఆధ్వర్యంలో ‘స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ.
2) ఈఈఈ విభాగం ఆధ్వర్యంలో ‘స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ.
ఉద్యోగాల సాధనలో వ్యక్తిగత నైపుణ్యాలు అత్యంత కీలకమని చెన్నైలోని హెచ్సీఎల్ సంస్థ మానవ వనరుల విభాగం ఏజీఎం కాంచన్ కేథ్కర్ అన్నారు. స్థానిక జీఎమ్మార్ ఇంజినీరింగ్ కళాశాలలో రెండ్రోజుల పాటు నిర్వహించే జాతీయ కార్యశాల (వర్క్షాప్) గురువారం నుంచి ఆరంభమైంది. కళాశాల ఈఈఈ విభాగం ఆధ్వర్యంలో ‘స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీ, కంప్యూటింగ్’ అనే అంశంపై దీన్ని నిర్వహిస్తున్నారు. దీనికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కంప్యూటర్ కోడింగ్ నైపుణ్యం ఇంజినీరింగ్ విద్యార్థులకు అత్యవసరమన్నారు. దీన్ని పెంపొందించుకొనేందుకు ప్రయత్నించాలని దిశానిర్దేశం చేశారు.
No comments:
Post a Comment