Friday, March 8, 2019

ఐటీ మినిస్టర్ అనేకంటే లూటీ మినిస్టర్ అనాలి…

కర్నూలు న్యూస్‌టుడే:
*2014 ఎన్నికల్లో డేటా చోరీ చేయడం వల్లనే చంద్రబాబు గెలిచారని……
*టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు సీఎం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదని వైసీపీ ఎమ్మెల్యే రోజా చెప్పుకొచ్చారు…
డేరాబాబా మాదిరిగా డేటా బాబాలుగా లోకేష్,చంద్రబాబు రెచ్చిపోతున్నారని కోడుమూరులో వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు.లోకేష్‌ను ఐటి మినిస్టర్ అనే కంటే లూటీ మినిస్టర్ అంటే బాగుంటుందని రోజా అన్నారు.2014 ఎన్నికల్లో డేటా చోరీ చేసే.. చంద్రబాబు గెలిచారని రోజా సంచలన ఆరోపణ చేశారు.టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు  సీఎం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదని వైసీపీ ఎమ్మెల్యే రోజా చెప్పుకొచ్చారు.

No comments:

Post a Comment