Tuesday, March 19, 2019

ముగ్గురు అభ్యర్థుల నామినేషన్లు………….


కర్నూలు సచివాలయం,న్యూస్‌టుడే:-
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో రెండో రోజైన మంగళవారం ముగ్గురు అభ్యర్థులు తమ నామపత్రాలను సంబంధిత ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులకు సమర్పించారు. కర్నూలు, నంద్యాల పార్లమెంట్‌ స్థానాలకు రెండో రోజు ఒక్క అభ్యర్థి కూడా నామ పత్రాలను సమర్పించలేదు. పాణ్యం నియోజకవర్గానికి ఇండియన్‌ ప్రజా బంధు పార్టీకి చెందిన ఎన్‌.కుమార్‌ అనే అభ్యర్థి ఒక సెట్‌ నామపత్రం సమర్పించారు. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి నాగన్‌ నవీన్‌ ముద్దమ్, డీఎస్‌ అప్సర్‌ బాషా అనే ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామపత్రాలను ఆర్వోలకు అందజేశారు. మిగిలిన అసెంబ్లీ నియోజక వర్గాలకు ఒక్క నామపత్రం కూడా రాలేదు. 
               

No comments:

Post a Comment