- సుప్రసిద్ధ మోక్ష కాశీ విశ్వనాధ స్వామి ఆలయంలో భైరవునికి అధిక ప్రాధాన్యత వుంది.
- కాలభైరవుడే వారణాసికి రక్షకుడిగా వుంటాడు. శనీశ్వరునికి గురువుగా కాలభైరవుడు పరిగణింపబడుతాడు.
- శనీశ్వరుడు, సూర్యుడి పుత్రునిగా యమధర్మ రాజుచే అవమానించబడి.. అపకీర్తిని మూటగట్టుకున్నాడు.
ఆయన తల్లి ఛాయాదేవి సలహా మేరకు భైరవుడిని ఆరాధించడం ద్వారా, కాలభైరవుడిని పూజించడం ద్వారా నవగ్రహాల్లో శనీశ్వరునికి ఒక పదవి లభించింది. అందుచేత కాలభైరవుడు శనీశ్వరునికి గురువుగా పరిగణింపబడుతాడు. అలాంటి కాలభైరవునికి శివుడు ఇచ్చిన హోద ఏంటంటే? శివునిని కొలిచే భక్తులకు కాలభైరవుని అనుగ్రహం లభిస్తుంది. కాలభైరవునిని పూజించే వారికి ఎలాంటి ఈతిబాధలువుండవని పరమేశ్వరుడు వరమిచ్చాడు.
No comments:
Post a Comment