న్యూస్టుడే:ఆంధ్రా మొత్తం ఒకే జోన్ లో ఉండాలి ఇచ్చాపురంలో రెండు ఎక్స్ ప్రెస్ రైళ్లకు హాల్ట్ కల్పించాలని స్ధానికులు ఎన్నోసార్లు కోరారు.వారితో పాటు కుర్ధా డివిజన్,భువనేశ్వర్ లోని ఈస్టుకోస్టు రైల్వేమండలి కేంద్రలతో పాటు దిల్లీ రైల్వే మంత్రిత్వ కార్యాలయాలకు పలుమార్లు నేను విన్నవించాను.అయినా సరే నేటికి అవి ఆగడం లేదు. అప్పటివరకూ ఆంధ్రుల పోరాటశక్తిని కేంద్రం చవిచూస్తూనే ఉంటుందని,మోదీకి 30 చెరువుల నీరు తాగించేందుకు 5కోట్ల ఆంధ్రులు సిద్ధంగా ఉన్నారని ఎంపీ రామ్మోహన్నాయుడు అన్నారు.ఇచ్ఛాపురం రైల్వే నిలయంలో మంగళవారం సాయంత్రం చేపట్టిన 15 గంటల వాల్తేరు డివిజన్ సాధన ధర్మపోరాట దీక్షను బుధవారం ఉదయం 9.30 గంటలకు ఎమ్మెల్యే డా.బెందాళం అశోక్తో కలసి విరమించారు.

No comments:
Post a Comment