తిరుమల న్యూస్టుడే:
*కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చిన ముఖ్యమంత్రికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు…..
*తారకరామ స్టేడియంలో జరిగే బహిరంగసభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు…..
తిరుమల శ్రీవారిని తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు దర్శించుకున్నారు. వారితో పాటు ఆయన తనయుడు, మంత్రి లోకేశ్ దంపతులు, మంత్రి యనమల, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి స్వామివారి సేవలో పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చిన ముఖ్యమంత్రికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరుపతికి చేరుకుని తారకరామ స్టేడియంలో జరిగే బహిరంగసభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు.

No comments:
Post a Comment