కడప న్యూస్టుడే:
- గతం లో ఓటమి పాలయ్యినప్పటికి ఇప్పుడు బరిలో దిగనున్న పనబాక లక్ష్మి.
- తనేకాకుండా తన భర్తను కూడా పార్టీలో చేర్చుకుంటున్న నేతలు.
తిరుపతి పార్లమెంట్ స్థానాన్ని మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్షితోపాటు ఆమె భర్త కృష్ణయ్య పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. పనబాక లక్ష్మి నెల్లూరు నుంచి 1996-1998, 1998-99 మధ్య ఎంపీగా గెలుపొందారు. 1999లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడి నుంచి తెదేపా అభ్యర్థి రాజేశ్వరమ్మ చేతిలో ఓడిపోయారు. మళ్లీ 2004లో కాంగ్రెస్ నుంచి గెలిచారు. 2009లో బాపట్ల పార్లమెంటు స్థానానికి పోటీ చేసి గెలుపొందారు. 2014లో ఓటమిపాలయ్యారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున తిరుపతి పార్లమెంటు స్థానానికి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఆమెతోపాటు భర్త కృష్ణయ్య పేరు కూడా పరిశీలనలో ఉందని పార్టీ నేతలు వెల్లడిస్తున్నారు.
No comments:
Post a Comment