శ్రీకాకులం,బూర్జ,న్యూస్టుడే:
1)ఆర్టీసీ బస్సులో తనిఖీ నిర్వహణ
2)13,470విలువ కలిగిన 50 గుట్కా ప్యాకెట్లు బట్టబయలు
2)13,470విలువ కలిగిన 50 గుట్కా ప్యాకెట్లు బట్టబయలు
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మదనాపురం కూడలి వద్ద ఏర్పాటు చేసిన వాహనాల తనిఖీ కేంద్రం వద్ద అదివారం పాతపట్నం నుంచి పాలకొండ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సులో తనిఖీ నిర్వహించగా ఓ వ్యక్తి వద్ద ఉన్న బ్యాగులో రూ.13,470 విలువ కలిగిన 50 గుట్కా ప్యాకెట్లు లభించినట్లు ఆకేంద్రం ఇన్చార్జి డి.రామకృష్ణ తెలిపారు. బస్సులో సిబ్బంది తనిఖీ నిర్వహిస్తుండంగా ఈ ప్యాకెట్లు పట్టుబడ్డాయి.దీనికి సంబంధించి పాలకొండ మండలం ఎన్.కె రాజపురానికి చెందిన ఎల్.శ్రీదేవిని అదుపులోకి తీసుకొని నియోజకవర్గ ఆర్ వో ఎల్. శివశంకర్కు, స్ధానిక పోలీసులకు సమచారం అందించారు. స్ధానిక ఎస్సై జి. భాస్కరరావు గుట్కా పాకెట్లను సీజ్ చేశారు. ఆమెతో పాటు జాకీ రమకృష్ణ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని కెసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

No comments:
Post a Comment