ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల మధ్య యుద్ధానికి దారితీసిన ‘ఐటీగ్రిడ్’ వివాదంపై కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి స్పందించారు. ఈ కేసులో దర్యాప్తునకు తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడాన్ని ఆమె ఎద్దేవా చేశారు. పొరుగు రాష్ట్రంలోని వివాదానికి సిట్ వేసి వాస్తవాలను వెలుగులోకి తెస్తామని కేసీఆర్ సర్కారు చెబుతోందని, మరి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు దాదాపు 20 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని అరిచి గీపెట్టినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

No comments:
Post a Comment