Friday, March 15, 2019

చెప్పిన ఖాతాలో జమ చేయండి……….


శ్రీకాకుళం, న్యూస్‌టుడే:
1) స్ధానిక  వ్యాపారులకు  బెదిరింపు  ఫోన్లు. 
2) రాజాం  పట్టణంలోని  వ్యాపారుల్లో  ఆందోళన వ్యక్తం. 
 ఈ  మధ్య  మీ వ్యాపారం  బాగానే  సాగుతున్నట్లుంది.  మీ హస్త్రం  ఇప్పుడే  చూశాం.  మీరు  తక్షణమే   రూ.10 వేలు   చెల్లిం,చండి…  లేదంటే  మీ  దుకాణాలపై దాడులు చేస్తాం ‘ అంటూ ఓ శాఖ అధికారుల పేరుతో   స్ధానిక  వ్యాపారులకు  బెదిరింపు  ఫోన్లు  వస్తున్నట్లు  సమచారం.  . ఇప్పటికే రాజాం పట్టణంలోని ఒక కిరాణా వర్తకుడు, బిస్కెట్ల ఏజెన్సీ వ్యాపారి, ఫ్యాన్సీ-మెడికల్‌ వ్యాపారం నిర్వహించే మరొకరికి ఈ తరహా ఫోన్లు వచ్చినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇది బయటకు  పాకడంతో  రాజాం పట్టణంలోని వ్యాపారుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. గతంలో ఈ తరహా బెదిరింపులు చూడని వర్తకులు తాజా పరిణామాల నేపథ్యంలో హడలిపోతున్నారు. ఫోన్లు చేస్తున్నది అధికారులు కాదని ప్రాథమికంగా వారిలో వారు రూఢి చేసుకుంటున్నా..మనసులో భయం మాత్రం పోవటం లేదు. ఇప్పటికి ముగ్గురికి ఫోన్లు రాగా, వీరిలో ఒకరు భయపడి ఆ వ్యక్తి చెప్పిన ఖాతాలో డబ్బులు జమ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. గత మూడ్రోజులుగా ఈ తరహా ఫోన్లు వస్తున్నట్లు చెబుతున్నారు.

No comments:

Post a Comment