కావల్సినవి:-
- రొయ్యలు – ఇరవై (తలభాగం తీసి వేయించి పెట్టుకోవాలి),
- చింతపండు గుజ్జు – అరకప్పు కన్నా తక్కువగా,
- బెల్లం – రెండు మూడు టేబుల్ స్పూన్లు,
- ఫిష్సాస్ – రెండు చెంచాలు,
- చిల్లీ గార్లిక్ సాస్,
- ఆయిస్టర్ సాస్ – ఒకటిన్నర చెంచా చొప్పున,
- ఉల్లిపాయ – ఒకటి(వేయించుకోవాలి),
- సోయాబీన్ నూనె -నాలుగు చెంచాలు,
- ఎండుమిర్చి నాలుగు (ముక్కల్లా తరగాలి),
- ఎండుమిర్చి గింజలు – రెండు చెంచాలు,
- వెల్లుల్లి ముక్కలు – రెండు చెంచాలు.
తయారీ:-
బాణలిలో నూనె వేడిచేసి వెల్లుల్లి ముక్కల్ని వేయించుకోవాలి.ఇందులో చింతపండు గుజ్జూ, బెల్లం, మూడు రకాల సాస్లూ వేసి బాగా కలపాలి. తరవాత ఎండుమిర్చి ముక్కలూ, గింజలూ వేయాలి. చింతపండు గుజ్జు చిక్కగా అయ్యాక అందుదలో వేయించుకున్న రొయ్యల్ని వేసేయాలి. రెండు మూడు నిమిషాల తరవాత దింపేసి ఉల్లిపాయ ముక్కలు అలంకరించి వడ్డించాలి.

No comments:
Post a Comment