గుంటూరు,న్యూస్టుడే:
*డేటా చోరీ విషయంలో జగన్ అనైతిక చర్యలకు పాల్పడుట …..
టీడీపీ ఎదుర్కోలేక జగన్ తెలంగాణ ప్రభుత్వంతో కలిసి అనేక కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని మంత్రి నక్కా ఆనంద బాబు అన్నారు. గుంటూరు వసంతరాయపురంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. డేటా చోరీ విషయంలో జగన్ అనైతిక చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. అక్రమాలకు విజయసాయిరెడ్డిపై కేసులు పెట్టే ధైర్యం తెలంగాణ పోలీసులకు ఉందా? అని ప్రశ్నించారు. రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతున్న జగన్కు విజ్ఞత కలిగిన ప్రజలే తగిన బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.
No comments:
Post a Comment