Wednesday, March 20, 2019

బాబూ స్టైల్ మార్చారు…


గుంటూరుజిల్లా: న్యూస్‌టుడే:  ముఖ్యాంశాలు...
  •   ప్రచారానికి మిగిలింది ఇక మూడు వారాలే…
  •  ఎక్కడ సభ పెట్టారో ఆ ప్రాంత విశిష్టత, ఆ ప్రాంతానికి ప్రభుత్వం చేసిన ప్రత్యేక కార్యక్రమాలు…
  • ప్రచారానికి మిగిలింది ఇక మూడు వారాలే…
  • దీంతో నేతలకు ప్రసంగాలకు పదునుపెడుతున్నారు. చంద్రబాబు ఈ విషయంలో వినూత్నంగా ప్రయత్నిస్తున్నారు.
  • తన గత ప్రసంగాలకు భిన్నంగా ప్రజలను ఆకట్టుకునే  ప్రయత్నం చేస్తున్నారు.
తాను చెప్పాలనుకున్న విషయాలతోపాటు కొన్ని ఆసక్తికరమైన విషయాలను ప్రజలముందు ఉంచుతున్నారు. చంద్రబాబు తన ప్రసంగంలో ఏం చెప్పాలనుకున్నారో అది స్పష్టంగా చెబుతారు. అయితే ఆ ప్రసంగం ఆసక్తికరంగా మారడానికి ఈ మధ్య కొన్ని మార్పులు కూడా చేశారు. ప్రచారం మొదలైన మూడు రోజుల్లోనే ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఐదేళ్లలో చేసిన అభివృద్ధితోపాటు పాత విషయాలను గుర్తు చేస్తున్నారు. ఎక్కడ సభ పెట్టారో ఆ ప్రాంత విశిష్టత, ఆ ప్రాంతానికి ప్రభుత్వం చేసిన ప్రత్యేక కార్యక్రమాలను ఏకరువుపెడుతున్నారు. అలాగె ప్రసంగాల్లో కొన్ని అంతర్జాతీయ విశేషాలు సయితం ప్రస్తావించడం తాజా విశేషం. ట్రెండ్‌కు తగినట్టుగా ప్రసంగంలో చంద్రబాబు మార్పులు చేశారు.  

No comments:

Post a Comment