Monday, March 11, 2019

పార్కులో పర్యాటకుల సందడి…..


శ్రీకాకుళం :సీతంపేట, న్యూస్‌టుడే :
సీతంపేటలోని ఎన్టీఆర్‌ సాహస ఉద్యానవనం(అడ్వెంచర్‌ పార్కు)లో పర్యాటకులు సందడి చేశారు. పార్కులోని సాహస, ఇతర క్రీడలతో పాటు బోటింగ్‌లో పర్యాటకులు పాల్గొని ఆనందంగా గడిపారు. సీతంపేట మండలం మెట్టుగూడ, దోనుబాయి దరి సున్నపుగెడ్డ, మల్లి జలపాతాల వద్ద పర్యాటకులు సందడిగా గడిపారు. జిల్లాతోపాటు సమీప జిల్లాలు, ఒడిశా నుంచి పర్యాటకులు వచ్చి ఆనందంగా గడిపి వెళ్లారు.

No comments:

Post a Comment