అనంతపురం న్యూస్టుడే:
- కియోకార్ల కంపెనీలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్.
- కార్యదర్శి ఇంతియాజ్ జెండా ఊపి ప్రారంభించారు.
కియోకార్ల పరిశ్రమ ఏర్పాటులో భూములు కోల్పోయిన రైతుల కుటుంబాలకు,స్థానిక నిరుద్యోగులకు ఆ కంపెనీలో ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సీపియం, సి ఐ ఐ, జనసేన ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా పెనుకొండలో మంగళవారం పాద యాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రను సిపిఎం దక్షిణ ప్రాంత జిల్లా కార్యదర్శి ఇంతియాజ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పరిశ్రమ కోసం 376 రైతు కుటుంబాలకు చెందిన 599 ఎకరాల భూమిని తీసుకుంటూ 30 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారనే కానీ ఒక్కరికి స్థానికులకు ఉద్యోగాలు కల్పించలేదని విమర్శించారు.
No comments:
Post a Comment