ఆంధ్రప్రదేశ్ డీజీపీ రామ్ ప్రవేశ్ ఠాకూర్(ఆర్పీ ఠాకూర్) హైదరాబాద్, ప్రశాసన్నగర్లో జీహెచ్ఎంసీకి చెందిన పార్కు భూమిని ఆక్రమించుకుని, దాని ఆసరాగా అక్రమ నిర్మాణాలు చేస్తున్నారంటూ తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అక్రమ నిర్మాణాలను కూల్చివేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
హైదరాబాద్ ప్రశాసన్నగర్లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం నామమాత్రపు ధరకు ప్లాట్లు కేటాయించిం దని రామకృష్ణారెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. అలాగే ఆర్పీ ఠాకూర్ కూడా ప్లాట్ నంబర్ 149లో 502 చదరపు గజా ల స్థలం పొందారన్నారు. 1996లో జీహెచ్ఎంసీ నుంచి జీ+1కి అనుమతి పొందారని, దానికి విరుద్ధంగా జీ+3 నిర్మించా రని పేర్కొన్నారు. అయినా, ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ అధికారులు చర్య తీసుకోలేదని తెలిపారు.
No comments:
Post a Comment